వైఎస్సార్‌ రైతు భరోసా 3వ విడత డబ్బుల జమ.. వివరాలు, ఇలా చెక్ చేసుకోండి

వైఎస్సార్‌ రైతు భరోసా | ఏపీ రైతులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు తీపి కబురు అందించారు దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందింది. అన్నదాత శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడే ముఖ్యమంత్రిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు తాజాగా వైయస్సార్ రైతు భరోసా మూడో విడత కు సంబంధించి నిధులను విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ నుండి సీఎం జగన్మోహన్ రెడ్డిగారు కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు.

వైఎస్సార్‌ రైతు భరోసా 3వ విడత

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వైఎస్సార్ రైతు భరోసా కింద మూడో విడత పెట్టుబడి సాయం ఏపీ ప్రభుత్వం చేసింది. 2021-2022 వేసంగి సీజన్లో మొత్తం 6899.6 7 కోట్లు జమ చేశారు.

ప్రతీ సంవత్సరం ysr రైతు భరోసా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాల కింద ప్రతి ఏటా మూడు విడతల్లో 13,500 వేల ఐదు వందలు రూపాయలు చొప్పున అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే.

2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైసీపీ రైతు భరోసా హామీ పథకాన్ని ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ పెట్టుబడి సాయం రైతులకు ఆర్థిక తోపాటు తోపాటు మరో సంధిస్తోంది ఇక అన్ని పంట అవసరాల కోసం ఉమ్మడిగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లో 2019 అక్టోబర్ 15న రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

వైఎస్సార్‌ రైతు భరోసా

రైతులు తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇందు కోసం మీరు మొదట
వైఎస్సార్ రైతు భరోసా వెబ్‌సైట్‌ (https://ysrrythubharosa.ap.gov.in/)లోకి వెళ్ళండి.

వై యస్ ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు జమ కాకపోతే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వారం లోపు ఎప్పుడైనా డబ్బులు జమ కావచ్చు ఒకవేళ అప్పటికీ డబ్బులు రాకుంటే మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం కి వెళ్లి ఫిర్యాదు చేస్తే మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ ను వెరిఫై చేసి అప్లోడ్ చేస్తారు అందుకు గల కారణం ఏంటో వాలంటీర్లు గుర్తించి మళ్ళీ నగదు పడేలా చేస్తారని అధికారులు చెబుతున్నారు ఇంకా ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

ఇక రైతు భరోసా నిధులు జమ అయిన రైతులకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు అభినందనలు తెలిపారు.

Leave a Comment